Sunday, December 03, 2023

Interesting Times Ahead in Telangana

Interesting times lie ahead in Telangana as the state grapples with the aftermath of the election setback faced by KCR's family. Recovering from this setback won't be easy for KCR's family. KCR was riding a tiger the past ten years. Now that the ride has stopped, he should brace himself against the tiger looking to maul him!

The Congress government will likely be hostile and may attempt to level corruption charges against KCR. Modi won't be any less hostile, as the BJP aims to gain political space.
KCR will be 75 years old in 2028 and may not be at the top of his game. KTR has not yet gained widespread acceptance. Should the Congress Chief Minister garner the approval of the people, it could prove exceedingly difficult for KCR's family to stage a political comeback.
KCR might just apologize to the people of Telangana, bid farewell to BRS and national party ambitions, and revert to the TRS name.
Revanth Reddy may not be the immediate choice for the Chief Minister post within the Congress. He lacks the necessary sophistication and gravitas. His public utterances lack the depth of insight and wisdom expected of a CM. The emergence of a strong Congress leader, previously not widely recognized, appears imminent in Telangana.
If the BJP does not get its act together, it will continue to be a minor participant in Telangana. CBI, ED, and IT can only do so much for BJP. The party needs to cultivate capable leaders if it hopes to gain more political space in the state.

End of KCR's Rule in Telangana

 కేసీఆర్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఏమీ లేదు కానీ, ఈ కొన్ని విషయాల్లో చాలా సమర్ధవంతంగా వ్యవహరించాడు అని అనగలను:

- ఆంధ్రా సెటిలర్లకు ఎటువంటి భయం లేకుండా, విధ్వేషాలకు తావు లేకుండా చెయ్యడం
- కరెంట్ సమస్యను తక్కువ వ్యవధిలో పరిష్కరించడం
- అన్నల ప్రాబల్యం మళ్ళీ పెరగకుండా కంట్రోల్ చెయ్యడం
- హైదరాబాద్ లో ఐటీ మరియు ఇతర పెట్టుబడుల ప్రోత్సాహాన్ని కొనసాగించడం (ఇది కేటీఆర్ ఖాతాలోకి వెళ్తుంది)
- మిష్షన్ కాకతీయ, మిష్షన్ భగీరథ
- తెలంగాణ భూముల రేట్లు పెరిగేలా చెయ్యడం
.
అసలు నచ్చనివి ఇవి:
- యాదగిరిగుట్ట గుడి స్తంభాలపై తన ప్రతిమలను చెక్కించడం
- వాస్తు కారణంగా వేల కోట్ల ప్రజా ధనాన్ని కొత్త అసెంబ్లీ, సెక్రటేరియెట్ ల నిర్మాణానికి వెచ్చించడం
- ఎకరాకు నీళ్ళు అందించాలంటే లక్షలు వెచ్చించాల్సి వచ్చే కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట వేల కోట్ల ప్రజా ధనాన్ని వ్యర్ధంగా ధారపోయడం
- కుటుంబ పాలన
- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ప్రాబల్యాన్ని పెద్దది చెయ్యడం
- ప్రభుత్యోద్యొగాల పరీక్షలను అత్యంత అసమర్ధంగా నిర్వహించడం
- ప్రజాకర్షక పధకాల పేరిట వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చెయ్యడం
- ఎన్నికల్లో లాభం పొందటం కోసం కొన్ని వర్గాలకు ప్రజా ధనాన్ని ధారపోయడం
- నియంతలా వ్యవహరించడం, వార్తా పత్రికల, విమర్శకుల నోళ్ళు నొక్కడం
- ప్రతిపక్షాలు లేకుండా చెయ్యాలని చూడడం
.
పై విషయాల్లో వ్యతిరేకత ఉన్నా, ప్రస్తుతానికి బీ.ఆర్.ఎస్ గెలవడమే తెలంగాణాకి మంచిదని నమ్మాను. కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ కుక్కలు చింపిన విస్తరి అయ్యే ప్రమాదం ఉంది. పదేళ్ళు వెనక్కి వెళ్ళే ప్రమాదమూ ఉంది. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భవిష్యత్తును నాశనం చేసే పాత పెన్షన్ విధానాన్ని తేవాలని కాంగ్రెస్ చూడడం అత్యంత దురదౄష్టకరం.

Sunday, November 19, 2023

Modi's Comforting Gestures

The disappointment in this Cricket World Cup Final brings to mind the letdown experienced by Indians due to the Chandrayaan-2 mission's failure. In both instances, there was an eagerness within Narendra Modi's public relations team to capitalize on potential positive sentiments that could have arisen in the event of success for Modi and the BJP.

It's understandable that the PR team sought to gain from the Chandrayaan-2 mission, considering the historical precedent of Indira Gandhi and Congress benefiting significantly from Rakesh Sharma's space mission. The iconic exchange between Indira Gandhi and Rakesh Sharma, immortalized in the hearts and minds of Indians, was likely a carefully orchestrated conversation. Sharma's response of "Saare Jahaan se Accha" was brilliantly apt.
Many decisions regarding the World Cup, from the schedule to the choice of venues, were influenced by Jay Shah-led BCCI with an eye on the elections. Notably, Punjab's Mohali did not host any matches this World Cup, and the final took place at Ahmedabad's Narendra Modi Stadium, potentially marking it as BJP's World Cup. Winning the final could have sparked widespread euphoria, benefiting the BJP in the upcoming elections.
While the success of these events could have been a public relations bonanza for Modi and the BJP, the PR team should have also taken into account the potential for a debacle.

Saturday, August 12, 2023

అవినీతిని నియంత్రించడం ఎలా?

రాజకీయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అందరికీ తెలిసిందే. 2014లో కాంగ్రెస్ ని గద్దె దించడంలో 2G మరియు ఇతర కుంభకోణాల పట్ల ప్రజల్లో ఉన్న అసహనం పాత్ర ఎంతైనా ఉంది. అన్నా హజారే నాయకత్వంలో నడిచిన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని, దాని పర్యవసానంగా ప్రజల్లో అవినీతిపై పెల్లుబికిన ఆగ్రహాన్నీ, కాంగ్రెస్ వ్యతిరేకతనీ మోడీ-షా చక్కగా ఉపయొగించుకొని 2014లో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నది జగమెరిగిన విషయమే.

అవినీతి పై ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉన్నా, దాని పర్యవసానాల పట్ల ప్రజా బాహుళ్యంలో ఇంత ప్రతికూలతా-అసహనం ఉన్నా, అసలు అవినీతి ఎలా సాధ్యమవుతుంది అన్న దానిపై ప్రజల్లో పూర్తిగా అవగాహన లోపించింది! ఎంత కాలం పార్టీలనూ, నాయకులనూ, ప్రభుత్వ అధికారులనూ నిందించడం తప్ప అసలు ఈ సమస్య ఎందుకు ఉత్పన్న మవుతుందన్న దానిపై ప్రజల్లో ప్రాధమిక అవగాహన కూడా కొరవడింది!

సరే, మరి అవినీతి ఎలా ఉత్పన్న మవుతుంది? ఎవరు బాధ్యులు? అన్న ప్రశ్నకు చాలా సరళమైన, ఖచ్చితమైన సమాధానం ఉంది! జన జీవితంలో రాజ్యం పరిధి-నియంత్రణ-అధికారం ఎంత ఎక్కువగా ఉంటే అవినీతి అంతే ఎక్కువగా ఉంటుంది! అవినీతిని తగ్గించాలంటే రాజ్యం పరిధిని తగ్గించాలి! అది చేయకుండా నినాదాలూ, కాకమ్మ కబుర్లూ చెబితే అవినీతి తగ్గదు!

ప్రభుత్వ పరిధిని రోజు-రోజుకూ పెంచుతూ, అనవసరమయిన నిబంధనలు-నియంత్రణ పెంచుతూ, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణను వాయిదా వేస్తూ, లేదా ఒక దానిలో ఇంకొకటి విలీనం చేస్తూ, ఎగుమతి-దిగుమతులను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ, పరిశ్రమలనూ-ఉత్పత్తినీ కుదేలు చేసేలా అధిక సుంకాలు వసూలు చేస్తూ, పి.వి. నరసింహా రావు మొదలు పెట్టిన, వాజపేయి కొనసాగించిన సంస్కరణలను అలాగే కొనసాగించకుండా వాయిదా వేస్తూ, ప్రజల నడుం విరిగేలా అధిక పన్నులు విధిస్తూ, ఎప్పటికప్పుడు తమ రాజకీయ పబ్బం గడుపుకుంటూ, మాది అవినీతి రహితమయిన ప్రభుత్వం అని మోడీ-షా జబ్బలు చరుచుకుంటుంటే ఒక వైపు జనం, మరో వైపు ప్రతిపక్షాలు-మీడియా చోద్యం చూస్తున్నాయి తప్పితే ఏమీ చేయలేకపోతున్నాయి!

9 ఏళ్ళ NDA ప్రభుత్వంలో నా మంత్రులందరూ మచ్చ లేని వారు, ఒక్క కుంభకోణం కూడా ఎరగని పరిశుద్ధమయిన ప్రభుత్వం నాది అని మోడీ అనవచ్చు. నిజమే కదా మరి! కానీ, ప్రజల నిత్య జీవితం ఏమయినా మెరుగు పడిందా, అవినీతి ఏమన్నా తగ్గిందా అంటే అస్సలు లేదనవచ్చు! ఎందుకంటే మంత్రుల అవినీతి ప్రభావం ప్రజల నిత్య జీవితంపై చాలా తక్కువ. మన బతుకులపై wholesale అవినీతి కంటే చిన్న మొత్తాల retail అవినీతి ప్రభావం అధికం!

అసలు ఈ అవినీతికన్నా నష్టపరిచేది అనవసరమయిన నియంత్రణలూ, పన్నులూ, సుంకాలు! అవినీతి ఉంటే అధికారి చేయి తడిపి వ్యాపారవేత్తలైనా, ప్రజలయినా తమ పనులు ముందుకు నెట్టుకోవచ్చు. కానీ లాప్టొప్ కొనాలంటే ఈ లైసెన్స్ తీసుకోవాలి, వ్యాపారం మొదలు పెట్టాలంటే ఆ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలంటే, దాని ప్రభావం మన దేశ ఆర్ధిక ప్రగతిపై, విదేశీ పెట్టుబడులపై, ఉద్యొగాలపై, మన తలసరి ఆదాయంపై, మన జీవన ప్రమాణాలపై పడుతుంది. కాకపొతే, ఈ ప్రభావం మనకు పెద్దగా తెలీకుండానే పడుతుంది. రోరోజుకీ ఏమీ తెలీదు కానీ, దశాబ్దాల తర్వాత పరికిస్తే, మనతో సమానంగా ఉన్న చైనా మన తలసరి ఆదయానికి 5 రెట్లతో దూసుకెళుతూ ఉంటుంది. మనం మాత్రం పడుతూ-లేస్తూ మనలో మనం Make in India, Viswa Guru అనుకుంటూ జబ్బలు చరుచుకుని సంతౄప్తి పడదాం!

మంత్రులకు నిర్ణయాధికారమిస్తే వారు ఎక్కడ పేట్రేగి, కుంభకోణాలు చేస్తారో అన్న భయంతో వారిని దిష్టిబొమ్మల్లా నిలబెట్టి, 1970-80 ల నాటి సోషలిస్టు, సంరక్షణవాద విధానాలను ఇంకా గుడ్డిగా నమ్మే ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు మోడీ! Minimum Government, Maximum Governance అన్న నినాదానికి కనీస అర్ధం మోడీకి తెలీదు! అతని దౄష్టిలో ఆ నినాదానికి అర్ధం దస్త్రాలను (Files) త్వరగా ముందుకు కదిలించడం! ఈ అవగాహనా రాహిత్యాన్ని గట్టిగా ప్రశ్నించలేని, దిక్కు తెలియని ప్రతిపక్షం ప్రజలకు లేని సమస్యలపై పోరాడుతూ కాలక్షేపం చేస్తుంటే, మెల్లగా-తెలీకుండా ఉడుకుతున్న నీళ్ళలో కదలకుండా కూర్చున్న కప్పల్లా ప్రజానీకం వ్యవహరిస్తోంది.

అవినీతి మరక మాకు లేదు అని సన్నాయి నొక్కులు నొక్కే మోడీ-షాలకు ఎన్నికల ఖర్చుల నిధులు ఎలా సమకూరతాయో అన్నది అందరికీ తెలిసిన రహస్యమే! అంబానీ-అదానీ లకు అనుకూలంగా BSNLని నాశనం చెసి, Walmartని రానీయకుండా చేసి, పోర్టులని కట్టబెడుతూ, సాయంగా ED-CBI లను ఉసిగొల్పుతూ రాజ్యాంగ వ్యవస్థలను నీరుగారుస్తూ ఉంటే అచ్చే దిన్, అఖండ్ భారత్ అని పగటి కలలు కంటూ కాలం వెళ్ళబుచ్చే ప్రజానీకం కొంచెం కళ్ళు తెరవాలి.

అవినీతి వ్యతిరేకం అంటూనే Laptopల దిగుమతులూ, బియ్యం ఎగుమతులను నియంత్రిస్తూ ఉన్న మోడీని, వోట్ల కోసం RTC ని ప్రభుత్వంలో విలీనం చేసే కే.సి.ఆర్-జగన్ లాంటి నాయకులను ప్రశ్నించడం మొదలు పెట్టాలి. అవినీతిని తగ్గించాలంటే ప్రభుత్వ పరిధి-నియంత్రణ-అధికారాన్ని తగ్గించాలని, నినాదాలిస్తూ కాకమ్మ కబుర్లు చెబితే అవినీతి తగ్గదని ప్రజలు గుర్తెరగాలి.

Sunday, May 21, 2023

కాంగ్రెస్ వద్ద ఈ ప్రశ్నలకు బదులుందా?

అవును! మోడీ అసమర్ధుడే. అతని తుగ్లక్ పరిపాలన వల్ల దేశ ఆర్ధికాబివ్రుద్ధి కుంటుబడింది. మరి దేశ ప్రజలకు ప్రస్తుతం ఉన్న ప్రత్యామ్నాయమేంటి? స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్సా? మరి కాంగ్రెస్ వద్ద ఈ కింది ప్రశ్నలకు బదులుందా?

- ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకమేనా? కాశ్మీర్ భారత దేశంలో ఒక విడదీయలేని అంతర్భాగం కాదా?
- అయోధ్యలో రామ మందిరం కట్టవద్దా? బాబ్రి మసీద్ నే ఉండనివ్వాలా?
- రాహుల్ గాంధీ అన్నట్టు దేశానికి ఉన్న పెద్ద ముప్పుల్లో హిందూ అతివాదం అతి ముఖ్యమయినదా?
- మైనారిటీలను ప్రసన్నం చేసుకోవడంలో మీ అత్యుత్శాహాన్ని అలాగే కొనసాగిస్తారా?
- మంత్రుల అవినీతిని అరికట్టలేరా? మీ మంత్రివర్గం అంటే ఎవరికి అందినది వారు దోచుకొనే ఒక బందిపోటు గుంపేనా?
- ఎన్.జీ.వోల ముసుగులో వివిధ దేశాలు సాగిస్తున్న మత మార్పిల్లను అడ్డుకోరా?
- వివిధ దేశాలు ఎన్.జీ.వోల ముసుగులో మన అభివ్రుద్దిని అడ్డుకుంటుంటే (demonstrations against Mining etc.) చోద్యం చూస్తారా?
- దేశ రక్షణలో కీలకమయిన విషయాల్లో మీరు భారత దేశం వైపు కాదా? చైనా కవ్వింపులకి మీరు ధీటుగా సమాధానమివ్వగలరా?

ఈ పై ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం భారత దేశం వైపే అని నిరూపించుకొనేదాక ప్రజలు భా.జ.పాకి తమ వోటు వేస్తూనే వుంటారు. అదానీ ఎంత తిన్నా, మోడీ ఎంత అసమర్దుడైనా! ఈ పై విషయాల్లో రాజీ పడడానికి ప్రజలు సిద్ధంగా లేరు. పై విషయాల్లో స్పష్టత లేకపోతే ఏ పార్టీకైనా జాతీయ ఎన్నికల్లో గెలుపు అసాధ్యం.

మరి కాంగ్రెస్ నాయకత్వం ఇది గుర్తించిందా? తదనుగుణంగా ఏమైనా మార్పులు చేసుకుంటుందా? ఖచ్చితంగా లేదు! ఆం.అద్మి పార్టీ (AAP) మాత్రం ఇది గుర్తించి కాంగ్రెస్ స్థానాన్ని మెల్లిగా ఆక్రమించుకొంటుంది. ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ ముక్త్ భారత్ సాకారం కావడం తధ్యం!

Sunday, May 14, 2023

రాష్త్ర స్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు

 గాంధీ-నెహ్రూ కుటుంబం నుంచి బలమయిన నాయకత్వం లేకున్నా రాష్త్ర స్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగలదని కర్ణాటక ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. రాష్ట్ర ఎన్నికల్లో గెలుపుకు కాంగ్రెస్ కు కావలసింది ఒక బలమయిన రాష్ట్రస్థాయి నేత. అయితే క్షేత్రస్థాయిలో నిజంగా పట్టు ఉన్న నాయకులు ఎవరో తెలుసుకోగలిగిన వివేకం-విచక్షణ ఇందిరా గాంధీ తరవాతి తరాల్లో లోపించింది. దీనితో, సర్పంచ్ లేక కార్పరేటర్ గా కూడా గెలవలేకున్నా, కేవలం అదిష్ఠానంతో ముఖ పరిచయం ఉందన్న కారణంగా రాష్ట్ర కాంగ్రెస్ లో చక్రం తిప్పే నేతల ఏలుబడిలో కాంగ్రెస్ రాష్ట్రాల్లో కుదేలవుతోంది.

34 యేళ్ళకే పీ.సి.సి అద్యక్షుడయినా, వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా రాష్ట్రంలో పట్టు సాధించడానికి చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. మొత్తానికి 1998లో మళ్ళీ పీ.సి.సి అద్యక్షుడయ్యి, 1999-2004 మధ్యలో శాసన సభలో ప్రతిపక్ష నేతగా పనిచేసి, పార్టీ పై పట్టు సాధించుకొని పాదయాత్ర చేసి 55 యేళ్ళకు సి.యం పదవి చేపట్టాడు. అయినా కూడా, జి.వెంకటస్వాముల-ఎం.సత్యనారాయణల బెడద మాత్రం తప్పలేదు.
రేవంత్ రెడ్డి అన్నట్టు కాంగ్రెస్ అంటే ఎవరికి వారు ముఠాలుగా విడిపోయి, ఎవరి ఆట వారు ఆడుకునే ఒక మునిసిపల్ ఆట స్థలం! ఈ ఆటస్థలంలో అందరూ కలిసి ఒక జట్టుగా ఆడేలా చేసే ఒక బలమయిన రాష్ట్రస్థాయి నాయకుడు ఉంటే కాంగ్రెస్ కు అదిష్టానంలో ఎవరు వున్నారు అన్నది ఒక సమస్య కాదు. కానీ, అలాంటి ఒక పస ఉన్న నేతను బలమయిన నాయకుడిగా, అదిష్ఠానం, వారితో-ముఖపరిచయం-ఉన్న-కొరగాని-నాయకులు ఎదగనిస్తారా అన్నది ప్రశ్నార్ధకం.
తెలంగాణా కాంగ్రెస్ లో బాహుబలి లాంటి నాయకుడు ఎదుగుతాడని కొన్నాళ్ళ కిందట జానా రెడ్డి జోస్యం చెప్పాడు. అతను రేవంత్ రెడ్డయితే కాదు. పరిణితి-పరిజ్ఞానం-నేర్పు-సామర్ధ్యం ఉన్న నాయకుడు వస్తే తెలంగాణలొ గానీ, మరే రాష్ట్రంలొ గానీ కాంగ్రెస్ అధికారం హస్తగతం చేసుకోగలదు. అదిష్ఠానంలో నెహ్రూ-గాంధీ కుటుంబసభ్యులు ఉన్నా-లేకున్నా పెద్ద తేడా ఏమీ ఉండదు!

Wednesday, May 03, 2023

ఎంపీ సీట్ కొల్పోనున్న రాహుల్ గాంధి. కాంగ్రెస్ పయనం మరి ఎటువైపు?

 రాహుల్ గాంధీ పై కోర్ట్ కేస్, తదనంతరం అతను తన ఎంపీ సీట్ కోల్పొవడం పై మరీ అంతగా బాధ పడక్కరలేదేమో! అవును, ఇది భారతదేశంలో ప్రజాస్వామ్య పతనానికి ఒక సూచిక. న్యాయస్థానాలు కూడా మోడి-షా గుప్పిట్లో ఉన్నాయనడానికి ఇది మరో నిదర్శనం.

మోడిపై, భారతదేశంలో ప్రజాస్వామ్య లేమిపై రాహుల్ విదేశాల్లో చేసిన వ్యాఖ్యలకు ఇది ప్రతిచర్య అనుకోవచ్చు. తన అనాలోచిత వ్యాఖ్యలతో మోడీకి మాత్రమే గాక భారతదేశ ప్రతిష్టకూ చేటు చేస్తున్నానని ఎరగక పోవడం రాహుల్ తప్పిదమే.
భారతదేశ రాజకీయాల పై నెహ్రూ-గాంధీ వంశానికి ఉన్న పట్టును తగ్గించడం మొడీ-షా ల ప్రధాన రాజకీయ లక్ష్యాలలో ఒకటి. తరాల తరబడి ఉన్న నమ్మకం-ఆరాధన, ఇంకా ఎంత కాదన్నా 20% ప్రజా మద్దతు ఉన్న ఒక వంశాన్ని నీరుగార్చడం అంటే అంత సులభమేమీ కాదు. ఇంతటి చరిత్ర, గుడ్డి నమ్మకం-మద్దతు ఉన్న వంశాన్ని ముక్కుసూటిగా పోయి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నీరుగార్చాలంటే ఇంకెన్ని తరాలు పడుతుందో చెప్పక్కరలేదు.
రాహుల్ కి వంశాంకురాలు లేకపోయినా, ప్రియాంకనో, ఆమె సంతతినో భుజాలకెక్కించుకొని తొక్కించుకోవడం తప్ప సిగ్గు-శరం లేని మనకు ప్రజాస్వామ్య పద్ధతులు అంతగా పనికిరావేమో! విదేశాల్లో రాహుల్ చేసిన అనాలోచిత వ్యాఖ్యలు ఎప్పటికయినా కావాల్సిన పతనాన్ని వేగవంతం చేశాయంతే!
ఇంతకీ దేశానికి ఏమి ఒరగబెట్టిందని ఆ వంశాన్ని తలకెత్తుకోవాలో ఏమో! నెహ్రూ వరకయితే, చారిత్రిక తప్పిదాలు ఎన్ని వున్నా, ఉద్దేశాలు-చిత్తశుద్ధిలో శంక లేదు కాబట్టి పరవాలేదు. ఇంక ఇందిర, ఆపై సంజయ్-రాజీవ్ ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తాము పడితే భూమిని అంతగా దద్ధరిళ్ళింపచేశే వ్రుక్షాలుగా నీరు పోసి వారిని అంతగా పెంచి పెద్ద చెయ్యటం ఎందుకో!
రాహుల్ సంగతికొస్తే వ్యక్తిగతంగా సౌమ్యుడిగా, ఏవో ఆదర్శాలు ఉన్నవాడిగా అగుపిస్తాడు. కానీ, ఆచరణ కొచ్హేసరికి క్షేత్రస్థాయిలో ఏమాత్రం అవగాహన, స్పష్టత లేని వాడిగా గోచరిస్తాడు. ప్రజల నాడిని పట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. క్షేత్రస్థాయిలో పట్టు ఉన్న నేతలను వదిలి, చుట్టూ చేరిన అంతరంగికుల మరియు భజనపరుల మాటలు విని, నిర్ణయాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ వినాశనాన్ని కొని తెచ్చుకోవడం మనమందరం చూసినదే.
కాంగ్రెస్ అంతం అవడం దేశానికి మంచిదే. స్వాతంత్ర్యం రాగానే రద్దు చేసి, ప్రజల రాజకీయ భావాల వ్యక్తీకరణకు ఒక సమాన పీఠాన్ని ఏర్పాటు చెయ్యాల్సిన బాధ్యతను మన మేరు శిఖరాలయిన నేతలు విస్మరించడంతో భారతదేశం కోల్పోయినది ఎంతంటే, ప్రపంచ దేశాల్లో ఇప్పుడు మన వెనుకబాటంత!
జాతీయ స్థాయిలో ఒక బలమయిన ప్రతిపక్షం అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే అధికార పక్షానికి పట్టా పగ్గాలు ఉండవు! కాంగ్రెస్ ఖాళీ చేస్తున్న ఈ స్థానాన్ని ఆం ఆద్మీ పార్టీ (AAP) భర్తీ చెయ్యాలని చూస్తున్నది. ఈ పరిణామం మొడీ-షాల ఎరుకలో లేకపోలేదు. అయితే ఈ ప్రస్థానంలో అం ఆద్మీ పార్టీ ప్రతి అంగుళానికీ భాజపాతో తీవ్రమయిన పోరాటం చేయక తప్పదు. ఈ రాబొయే పదేళ్ళలో అరవింద్ కేజ్రీవాల్ సరయిన నాయకత్వం అందిస్తే, 2034 లో ఆప్ (AAP) భాజపా తో నువ్వా-నేనా అన్నంతగా పోటీ పడగలదు అనడంలో సందేహం లేదు!



Saturday, November 19, 2022

AAP's Rise in National Politics

The next 10-15 years period is going to see the gradual rise of Aam Aadmi Party in national politics. AAP is well on its way to supplant Congress as the main opposition party. For the tipping point to occur, AAP needs to form government in 5-6 states. This may happen between 2027-30. By 2034, AAP will be competing with BJP to form the government at the center.
AAP is recognized as a state party in Delhi, Goa, and Punjab. One more such recognition will automatically qualify it to become a national party. AAP might achieve this in the oncoming Gujarat state elections.
Indian polity is sorely missing a strong opposition party at the center. The rise of a non-traditional party into that role should be welcomed. Yes, it is true that Kejriwal is an opportunist and his leadership style is autocratic. His willingness to employ questionable tactics in pursuit of power ring many alarm bells. However, Kejriwal's realpolitik is a necessity in this political climate.
It should be noted that national politics has moved to the left of the spectrum in terms of economics and right of the spectrum in terms of religion and nationalism. Modi has mastered this balancing act and it has paid him rich dividends.
Arvind Kejriwal is no stranger to welfare politics and freebies. AAP is already known for good governance, with Mohalla Clinics and improvements in Education. AAP owes its origins to the India Against Corruption movement. What's missing in AAP's armory is appeasement of Hindu voters. The recent Goddess Lakshmi on currency notes demand is aimed in that direction.
No party that has qualms about abrogation of Article 370 and construction of Ram Mandir can dream of ruling India! This is what Arvind Kejriwal has recognized and Rahul Gandhi continues to be blind to.