Sunday, May 21, 2023

కాంగ్రెస్ వద్ద ఈ ప్రశ్నలకు బదులుందా?

అవును! మోడీ అసమర్ధుడే. అతని తుగ్లక్ పరిపాలన వల్ల దేశ ఆర్ధికాబివ్రుద్ధి కుంటుబడింది. మరి దేశ ప్రజలకు ప్రస్తుతం ఉన్న ప్రత్యామ్నాయమేంటి? స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్సా? మరి కాంగ్రెస్ వద్ద ఈ కింది ప్రశ్నలకు బదులుందా?

- ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకమేనా? కాశ్మీర్ భారత దేశంలో ఒక విడదీయలేని అంతర్భాగం కాదా?
- అయోధ్యలో రామ మందిరం కట్టవద్దా? బాబ్రి మసీద్ నే ఉండనివ్వాలా?
- రాహుల్ గాంధీ అన్నట్టు దేశానికి ఉన్న పెద్ద ముప్పుల్లో హిందూ అతివాదం అతి ముఖ్యమయినదా?
- మైనారిటీలను ప్రసన్నం చేసుకోవడంలో మీ అత్యుత్శాహాన్ని అలాగే కొనసాగిస్తారా?
- మంత్రుల అవినీతిని అరికట్టలేరా? మీ మంత్రివర్గం అంటే ఎవరికి అందినది వారు దోచుకొనే ఒక బందిపోటు గుంపేనా?
- ఎన్.జీ.వోల ముసుగులో వివిధ దేశాలు సాగిస్తున్న మత మార్పిల్లను అడ్డుకోరా?
- వివిధ దేశాలు ఎన్.జీ.వోల ముసుగులో మన అభివ్రుద్దిని అడ్డుకుంటుంటే (demonstrations against Mining etc.) చోద్యం చూస్తారా?
- దేశ రక్షణలో కీలకమయిన విషయాల్లో మీరు భారత దేశం వైపు కాదా? చైనా కవ్వింపులకి మీరు ధీటుగా సమాధానమివ్వగలరా?

ఈ పై ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం భారత దేశం వైపే అని నిరూపించుకొనేదాక ప్రజలు భా.జ.పాకి తమ వోటు వేస్తూనే వుంటారు. అదానీ ఎంత తిన్నా, మోడీ ఎంత అసమర్దుడైనా! ఈ పై విషయాల్లో రాజీ పడడానికి ప్రజలు సిద్ధంగా లేరు. పై విషయాల్లో స్పష్టత లేకపోతే ఏ పార్టీకైనా జాతీయ ఎన్నికల్లో గెలుపు అసాధ్యం.

మరి కాంగ్రెస్ నాయకత్వం ఇది గుర్తించిందా? తదనుగుణంగా ఏమైనా మార్పులు చేసుకుంటుందా? ఖచ్చితంగా లేదు! ఆం.అద్మి పార్టీ (AAP) మాత్రం ఇది గుర్తించి కాంగ్రెస్ స్థానాన్ని మెల్లిగా ఆక్రమించుకొంటుంది. ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ ముక్త్ భారత్ సాకారం కావడం తధ్యం!

No comments: