Tuesday, September 30, 2025

భారత దేశంలో వ్యక్తిగత స్వేచ్చ, ఆర్ధిక స్వేచ్చ

 భారత దేశంలో పౌర హక్కులు, స్వేచ్చ మెండు గానూ, ఆర్ధిక హక్కులు చాల తక్కువగానూ ఉండేవని మొన్నటి దాకా అందరూ అంగీకరించిన విషయం. సింగపూర్ లాంటి దేశాల్లో అది రివర్స్! అక్కడ పౌర హక్కులు లుప్తం, గానీ ఆర్ధిక రంగంలో వెసులుబాటు చాలా మెరుగు. తూర్పు ఆసియా దేశాలు మనల్ని వెనక్కి నెట్టి చాలా ముందుకు పోవడానికి ఈ ఆర్ధిక స్వేచ్చే కారణం.

అయితే, ఇప్పటి సంగతేంటి? మోడీ రాజ్యంలో మన స్థితిగతులు మెరుగుపడ్డాయా? ఆర్ధిక విషయాల్లో అచ్చే దిన్ దేవుడెరుగు, లేనిపోని తలనెప్పులు వచ్చాయి. మరి పౌర హక్కులు? అవి మాత్రం రోజురోజుకీ తరుగుతున్నాయి. పౌరస్వేచ్చ కాలరాయబడుతోంది. మనం రెంటికీ చెడ్డ రేవడి అయ్యాం!
వ్యాపారం చెయ్యాలంటే అలవికాని నియంత్రణలు అలానే ఉండగా, భయంకరమైన టాక్సులు మన నడ్డి విరగగొడుతున్నాయి. అనేక రంగాల్లో ప్రభుత్వ జోక్యం విపరీతం. ఎగుమతులు చెయ్యలన్నా, దిగుమతులు చేసుకోవాలన్నా ప్రభుత్వం విధించే సుంకాలూ, ఆంక్షలూ తట్టుకోవాలి.
పౌర స్వేచ్చ విషయానికి వస్తే, సినిమాకి వెళ్తే జనగణమన నించుని పాడి డేశభక్తి నిరూపించుకోవాలి! గొడ్డు మాంసం మీద అంక్షలతో మొదలయ్యి, మెల్లగా ఏ మాంసం తినాలన్నా ఆంక్షల దిశగా వెళుతున్నాం. ప్రభుత్వాన్ని విమర్శిస్తే జైలు పాలవ్వాలి, యూపీ లాంటి రాష్ట్రాల్లో అయితే బుల్డోజర్తో ఇల్లు కూలుతుంది. యువకులు పార్కుల్లో ప్రేమికులతో తిరిగితే పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. ఇంటర్నెట్ యాక్టివిటీపై నిఘా ఎక్కువయ్యింది.
పౌర హక్కులు తగ్గుతుంటే మరి ప్రజల్లో ఎందుకు నిరసన గట్టిగా వినిపించట్లేదు? ఒక్కక్క విషయంలో వారి-వారి సామాజిక మూలాలను బట్టి ఎవరికి వారు స్పందిస్తున్నారు. ప్రస్తుతం మైనార్టీల ఆర్ధిక/సామాజిక జీవనంపై దాడి జరుగుతోంది. మెజారిటీ వర్గానికి ఇంకా అంత చురుకు తగల్లేదు.
మొత్తానికి, రెంటికీ చెడ్డ రేవడి అయ్యాం! ఆ విధంగా మనం ముందుకు పోతున్నాం!

Saturday, September 20, 2025

భారత దేశానికి ప్రధాన శత్రువు

 భారత దేశానికి ప్రధాన శత్రువు ఇతర దేశాలపై ఆధారపడడమా? ఇంతకీ ఎందుకు మనం ఆధారపడవలసి వస్తోంది?

ఎగుమతుల సంగతి దేవుడెరుగు, మన మానుఫాక్చరింగ్ రంగం మన అవసరాలను కూడా ఎందుకు తీర్చలేకపోతుంది? ఎందుకు మన ఉత్పత్తులు చైనా కంపెనీలతో పోటీ పడలేక పోతున్నాయి?
మన అసలైన శత్రువులు ఇవి:
- గవర్నమెంట్ ఇంకా రెగ్యులేషన్ లను కొనసాగిస్తుండడం.
- అత్యంత అవసరమయిన సంస్కరణలను బుట్ట దాఖలు చెయ్యడం.
- గవర్నమెంట్ వ్యాపారం చెయ్యాలని చూడడం. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చెయ్యకపోవడం.
- రాజకీయ పార్టీల దృష్టంతా వచ్చే ఎన్నికలు గెలవడమెలా అని తప్పితే దేశాన్ని ఆర్ధికంగా ఎలా అభివ్రుద్ధి చెయ్యాలో పట్టక పోవడం.
- విద్య, ఆరొగ్యం, పోలిసింగ్ విషయంలో సంస్కరణలు తేవాలని అస్సలు పట్టక పోవడం.
- ఘోరమయిన న్యాయ వ్యవస్థ
- స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చెయ్యకుండా అంతా PM/CM/DM చుట్టూరా తిరిగేటట్టు చెయ్యడం.
రెగ్యులేషన్ల వల్ల, అలవి కాని రూల్స్ వల్ల బలి అయ్యేది చిన్న-మధ్య తరహా పరిశ్రమలే. నానా రకాల రూల్స్ పేరిట గవర్నమెంట్ అధికారులు పీడించడంతో వ్యాపారవేత్తలు పరిశ్రమలు పెట్టాలంటే జంకే పరిస్తితి. ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం? బంగారం, రియల్ ఎస్టేట్ లపై పెడితే సరిపోతుందిగా! ఇంక బడా పారిశ్రామికవేత్తలకు రాజకీయ నాయకులనూ, అధికారులను మచ్చిక చేసుకోవడం వెన్నతో పెట్టిన విద్య. రూల్స్ ఎన్ని ఎక్కువ వుంటే అంత మంచిది. పోటీ అనేది వుండదు. ఎంత నాసిరకమయిన ఉత్పత్తి అయినా, ధర ఎంత ఎక్కువున్నా వినియోగదారులు చచ్చినట్లు కొనాల్సిందే! ఇతర దేశాల కంపెనీలు తక్కువ ధరకు అందిస్తున్నాయా? దిగుమతులపై సుంకం విధించాలని గవర్నమెంట్ పై వత్తిడి తెస్తే సరి!
- అసలు పరిశ్రమలు నడపాలంటే కార్మిక చట్టాల సంస్కరణ చెయ్యాలి కదా?
- పరిశ్రమకు భూమి కావాలంటే భూసేకరణ అత్యంత క్లిష్టమయినది కదా?
- వ్యవసాయ చట్టాలను ఎప్పుడు మరి సంస్కరించడం?
ప్రభుత్వ ప్రమేయం ఉంటే ఇంక ఆ రంగం సంక నాకి పొయినట్టే అని తెలిసే కదా, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేయ్యడం ప్రారంభించింది పీవీ, వాజపేయిలు. మరి ఇప్పుడు నేను ఏదో ఉద్ధరిస్తాను అని బయల్దేరడమేంటి?
కనీసం రక్షణ రంగం లోనన్నా ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఇచ్చారు, సంతోషం! లేకపోతే దశాబ్దాల తరబడి పరిశోధనలు చేసినా ఒక్క సరయిన ఎయిర్క్రాఫ్ట్ ఎంజిన్ కూడా సరిగా ఉత్పత్తి చెయ్యడం HAL వల్ల కాలేదు!
ఇవన్నీ చెయ్యకుండా ఆత్మనిర్బర్ భారత్ అని జబ్బలు చరుచుకుని కాలం వెళ్ళదీస్తే, రేపు ఆర్ధికంగానే కాదు, దేశ రక్షణ పరంగా కూడా ప్రమాదమే!

Saturday, March 01, 2025

ఉక్రెయిన్ సమస్య

 ఉక్రెయిన్ సమస్య సంక్లిష్టమైనదే! రష్యా ఆధిపత్య పరిధి లో ఉన్న పొరుగు దేశాల్లో అమెరికా జోక్యం పై పుతిన్ ఎన్నోసార్లు తన ఆసంతృప్తిని వ్యక్తపరిచాడు. కానీ, రష్యాని అలా వదిలేస్తే పొరుగు దేశాలను నయనో, భయానో తిరిగి ఆక్రమించి మళ్ళీ సోవియట్ యూనియన్ అంతటి ఆర్ధిక ప్రాభవాన్ని ఎక్కడ సంతరించుకుంటుందో అని అమెరికా భయం!

దేశాధినేతలు తమ దేశం యొక్క భూభాగం మరియు జనాభానే కాదు తమ దేశ చారిత్రక వైభవ కధనాన్ని కూడా వారసత్వంగా పొందుతారు! పుతిన్ తనకు అలెక్జాండర్ III పట్ల ఉన్న ఆరాధ్యభావాన్ని ఎన్నో సార్లు వ్యక్తపరిచాడు. గత రెండు దశాబ్ధాలుగా, రష్యాని ఆర్ధికంగా పరిపుష్టం చేసి, ఆంక్షలను ఎదుర్కొనే లాగా తయారు చేశాడు.
జీడీపీ పరంగా చూస్తే రష్యా అమెరికాలో పదిహేనో వంతే ఉన్నప్పటికీ, మిలటరీ సామర్ధ్యంలో రమా-రమి అగ్ర రాజ్యం కిందే లెక్క! పొరుగు దేశాలను కూడగట్టి, ఆర్ధికంగా బలంగా తయారయ్యి తన ఏకఛత్రాదిపత్యానికి ఎక్కడ ఎసరు పెడుతుందొ అని అమెరికా భయం. అసలే రష్యా ఒక సమర్ధుడయిన నియంత పాలన లో ఉంది! రష్యా అంటే యూరొప్ కి ఎప్పటికీ ఒకింత భయంతో కూడిన అనుమానమే! ఈ భయంతో, అమెరికా నాటోని విస్తరించి ఎస్టోనియా, లాత్వియా, లిథుయేనియా లను నాటోలోకి ఆహ్వానించింది. నాటో సభ్య దేశాలపై దాడి చేస్తే అమెరికాతో సహా నాటో కూటమితో యుద్ధం చెయ్యాల్సి ఉంటుంది. అందుకే జార్జియా, ఉక్రయిన్ లకు నాటొలో చేరాలని అంత ఉబలాటం!
విస్తరణ కాంక్ష లేకపొతే ఈ దేశాల నాటో చేరికపై రష్యాకు అంత మండిపాటు ఎందుకు అన్నది పాశ్చ్యాత్య దేశాల వాదన. రష్యా ఆధిపత్య పరిధి లోకి అంత చొచ్చుకెళ్ళడం ఎందుకని రష్యా సమర్ధకుల వాదన.
2014లో రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసి క్రిమియా, డోంబాస్ లను ఆక్రమించింది. గత మూడేళ్ళలో, అమెరికా ఆయుధ బలాన్ని ఎదుర్కొంటూ ఉక్రెయిన్ లో ఐదో వంతును ఆక్రమించింది. ఈ యుద్ధాన్ని ఆఖరి ఉక్రెయిన్ పౌరుడి ప్రాణాలను, ఆఖరి అమెరికా టాక్స్ డాలర్ను ఖర్చు చేసేవరకూ పోరడతామని బైడెన్, జెలెన్స్కీ లు మొండిపట్టు పట్టగా, రష్యా వెరవకుండా యుద్ధం చేస్తూనే వుంది.
ఈ కోల్పోయిన అయిదో వంతు భూభాగాన్ని యుద్ధం మొదట్లోనే ఇచ్చేసి ఉంటే ఇంత ప్రాణ, ధన నష్టం నివారించవచ్చు కదా అని ఒక వైపు వాదన. అలా సులువుగా రష్యాకి లొంగిపొతే, ఆ తరవాత మిగతా పొరుగు దేశాలకూ, పొలాండ్ కూ, స్కాండినేవియన్ దేశాలకు, అట్లాంటిక్ మహాసాగరం అవతల ఉన్న అమెరికాకూ రష్యా ముప్పు తీవ్రమవుతుందని ఇంకొక వైపు వాదన.
ఉక్రెయిన్ తన అణ్వాయుధాలను నిర్వీర్యం చేసేలా ఒప్పించి, తీరా ఆపదలో ఆదుకోక పోతే అమెరికా వాగ్ధానాలకూ, ఒప్పందాలకూ, పెద్దరికానికీ విలువ పోతుందనీ, అది ధీర్ఘకాలంలో చేటు చేస్తుందని బైడెన్-జెలెన్స్కీ సమర్ధకుల వాదన. రష్యా దురాక్రమణకు ఆదిలోనే అడ్డుకట్ట వెయ్యకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వారి వాదన.
అయితే, ట్రంప్, దశాబ్ద-శతాబ్దానంతర పరిణామాలకు విలువనిచ్చే రాజనీతిజ్ణుడు (Statesman) కాడు. ఈ సంవత్సర బాలన్స్ షీట్ బాగుండేలా నిర్ణయాలు తీసుకునే ఒక పక్కా బిజినెస్ మాన్! నా 350 బిలియన్ డాలర్లను తీసుకొని నువ్వు నాకేమి ఇచ్చావని, లక్షల మంది ప్రాణ నష్టానికీ, లెక్కలేనంత ఆస్థి నష్టానికీ, ప్రపంచ ఆర్ధిక అనిశ్చితికీ, పెట్రొలు ధరలు పెరగడానికీ నీ మొండిపట్టే కారణం అనీ ట్రంప్ వాదన.
ఉక్రెయిన్ భూభాగంలో అయిదవ వంతు తీసుకుని పుతిన్ ఆగుతాడా, మరింత రెచ్చి పోతాడా అన్న ప్రశ్నకు సమాధానం ఎదురు చూస్తే కానీ తెలీదు.
ఇదంతా కాదు. అసలు ఎపుడో శతాబ్దాల క్రితం నాటి తమ జాతి ఉచ్చ స్థితిని తిరిగి తీసుకు రావాలని రష్యాలో పుతిన్, టర్కీ లో యెర్డొహాన్, చైనా లో షీ జింపింగ్, భారత్ లో మోడీ ప్రయత్నించడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ 21వ శతాబ్ధంలో, అలెక్జాండర్ నాటి రాజ్యవిస్తరణ కాంక్షకు అస్సలు అర్ధం లేదు. దీనంతటికీ కారణమైన అసలు తప్పు ఎవరిదీ అంటే, ఇంకా కేంద్రీకృతమయి ఉన్న అధికారానిదీ, దేశభక్తి పేరుతొ జాతీయ అతి వాదాన్ని నూరి పోసే తిరోగమన వాదాలదీ, ఒక వ్యక్తి చేతుల్లో 21వ శతాబ్దంలో కూడా ఇంతటి మిలిటరీ అధికారాన్ని కట్టబెట్టే వ్యవస్తలదీ!

Wednesday, January 01, 2025

Item Songs in Pushpa Film Series

 The Pushpa film series presents a striking paradox in its treatment of gender dynamics through its "item songs". Both "Oo Antava" from Pushpa (2021) and "Kissik" from Pushpa 2 attempt to critique male behavior while simultaneously catering to the male gaze.

In "Oo Antava," Samantha Ruth Prabhu performs a dance number that ostensibly criticizes men's objectifying gaze. The lyrics challenge male viewers about their voyeuristic tendencies, yet the visual presentation - featuring Samantha in revealing costumes performing suggestive dance moves - serves the very male gaze it criticizes. This creates a fundamental disconnect: while the song verbally condemns objectification, its visual elements actively participate in it.
"Kissik" from Pushpa 2 follows a similar pattern. The lyrics condemn men who exploit women's images for personal gratification, warning of consequences. However, the presentation of Sreeleela in revealing attire, performing seductive choreography, contradicts this message of female empowerment.
The filmmakers attempt to appear progressive through lyrics while adhering to conventional market expectations through visuals. This results in a self-defeating message where the medium undermines the intended message.

Saturday, March 30, 2024

భాజపాతో తెలుగుదేశం పొత్తు

 తెలుగుదేశం పార్టీ వినాశనాన్ని భాజపా కోరుకుంటుందని 2014-2019 మధ్యలోనే స్పష్టమయ్యింది. భాజపాలో ఉండి తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తాడని పేరున్న వెంకయ్య నాయుడిని ఉపరాష్త్రపతి పదవిలో కూర్చోబెట్టి అడ్డు తొలగించుకొంది. ఈ కింది విషయాల్లో తెదేపా ప్రభుత్వానికి ఎటువంటి మద్దతు ఇవ్వకుండా, NDA లోంచి పొమ్మనకుండా పొగ పెట్టింది:

- స్పెషల్ స్టేటస్ / స్పెషల్ ప్యాకేజీ
- రెవెన్యూ లోటు నిధులు
- పోలవరం ప్రాజెక్ట్ కి సకాలంలో సరిపడా నిధులు
- రాజధాని నిర్మాణానికి సరిపడా నిధులు
- విశాఖపట్నం కి కొత్త రైల్వే జోన్
- IIT, IIM, AIIMS ల ఏర్పాటుకు నిధులు
- జగన్ పై కేసులు తేల్చడం
2014-2019 మధ్యలోనే భాజపా జగన్ తో మంతనాలు జరిపింది. రాజ్యసభలో మైనారిటీ ఉండడంతో జగన్ మద్దతు తీసుకొంది. 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జగన్ భాజపాకి అనుకూలంగా ఉండడం, అంబానీ-అదానీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం అందరికీ తెలిసిందే.
ప్రాంతీయ పార్టీల పై భాజపా చేస్తున్న ప్రచ్చన్న యుద్ధం అందరికీ తెలిసిందే. కుటుంబ పార్టీలని చీల్చి, వారి ప్రభుత్వాలను కూల్చి, ఆ పార్టీల పతనాన్ని వేగవంతం చేయడం చూస్తూనే ఉన్నాం. ఆ వరుసలోదే AP లో భాజపా వైఖరి! నాయకత్వ బదిలీ దశలో ఉన్న తెలుగుదేశాన్ని అధికారానికి దూరంగా ఉంచి, బలహీన పడేటట్లు చేసి, జగన్ ప్రభుత్వంపై క్రైస్థవ ముద్ర స్పష్టమయ్యేదాక వేచి చూసి, ఆపై హిందూ మతం ప్రమాదంలో పడిందన్న వాదాన్ని తెచ్చి 2029 నించి మెల్లగా తెదేపా స్థానాన్ని ఆక్రమించాలని పెద్ద ప్రణాళిక రచించింది భాజపా! ఒక్క మాటలో చెప్పాలంటే భాజపాకు అసదుద్దీన్ ఓవైసీ ఎంత ముఖ్యమో, జగనూ అంతే! ఈ యిన్-యాంగ్ ల సంబంధం ఓట్లను కొల్లగొట్టడంలో భాజపాకు తురుపుముక్క.
ఇంత చేసినా, భాజపా ఉద్దేశాలు ఇంత స్పష్టంగా ఉన్నా, చంద్రబాబు-పవన్ లు భాజపాతో జట్టు కట్టడం విచిత్రం! కూటమి విషయంలో భాజపా కాపట్యం బయటపడటానికి ఎన్నికల దాక వేచి చూడక్కరలేదు. రఘురామ క్రిష్ణమరాజు (RRR) విషయంలోనే అది స్పష్టమయ్యింది; భాజపా-వైసీపీ లోపాయికారి సంబంధం ప్రస్ఫుటమయ్యింది.
ఈ ఎన్నికల్లో APలో కూటమి విజయం భాజపాకి అనవసరం. భాజపాకి కావలసిందల్లా తెదేపా బలహీనపడడం. పైపైకి ఎలా కనిపించినా, 2024లో APలో వైసీపీ విజయం భాజపా AP ధీర్ఘకాలిక వ్యూహంలో ఒక భాగం! చంద్రబాబు-పవన్ లు ఎన్ని ప్రయత్నాలు చేసినా భాజపాను ఈ వ్యూహాన్నుంచి విరమింపచేయలేరు!

Sunday, December 03, 2023

Interesting Times Ahead in Telangana

Interesting times lie ahead in Telangana as the state grapples with the aftermath of the election setback faced by KCR's family. Recovering from this setback won't be easy for KCR's family. KCR was riding a tiger the past ten years. Now that the ride has stopped, he should brace himself against the tiger looking to maul him!

The Congress government will likely be hostile and may attempt to level corruption charges against KCR. Modi won't be any less hostile, as the BJP aims to gain political space.
KCR will be 75 years old in 2028 and may not be at the top of his game. KTR has not yet gained widespread acceptance. Should the Congress Chief Minister garner the approval of the people, it could prove exceedingly difficult for KCR's family to stage a political comeback.
KCR might just apologize to the people of Telangana, bid farewell to BRS and national party ambitions, and revert to the TRS name.
Revanth Reddy may not be the immediate choice for the Chief Minister post within the Congress. He lacks the necessary sophistication and gravitas. His public utterances lack the depth of insight and wisdom expected of a CM. The emergence of a strong Congress leader, previously not widely recognized, appears imminent in Telangana.
If the BJP does not get its act together, it will continue to be a minor participant in Telangana. CBI, ED, and IT can only do so much for BJP. The party needs to cultivate capable leaders if it hopes to gain more political space in the state.

కేసీఆర్ పాలన లో నచ్చినవి, అస్సలు నచ్చనివి

 కేసీఆర్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఏమీ లేదు కానీ, ఈ కొన్ని విషయాల్లో చాలా సమర్ధవంతంగా వ్యవహరించాడు అని అనగలను:

- ఆంధ్రా సెటిలర్లకు ఎటువంటి భయం లేకుండా, విధ్వేషాలకు తావు లేకుండా చెయ్యడం
- కరెంట్ సమస్యను తక్కువ వ్యవధిలో పరిష్కరించడం
- అన్నల ప్రాబల్యం మళ్ళీ పెరగకుండా కంట్రోల్ చెయ్యడం
- హైదరాబాద్ లో ఐటీ మరియు ఇతర పెట్టుబడుల ప్రోత్సాహాన్ని కొనసాగించడం (ఇది కేటీఆర్ ఖాతాలోకి వెళ్తుంది)
- మిష్షన్ కాకతీయ, మిష్షన్ భగీరథ
- తెలంగాణ భూముల రేట్లు పెరిగేలా చెయ్యడం
.
అసలు నచ్చనివి ఇవి:
- యాదగిరిగుట్ట గుడి స్తంభాలపై తన ప్రతిమలను చెక్కించడం
- వాస్తు కారణంగా వేల కోట్ల ప్రజా ధనాన్ని కొత్త అసెంబ్లీ, సెక్రటేరియెట్ ల నిర్మాణానికి వెచ్చించడం
- ఎకరాకు నీళ్ళు అందించాలంటే లక్షలు వెచ్చించాల్సి వచ్చే కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట వేల కోట్ల ప్రజా ధనాన్ని వ్యర్ధంగా ధారపోయడం
- కుటుంబ పాలన
- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ప్రాబల్యాన్ని పెద్దది చెయ్యడం
- ప్రభుత్యోద్యొగాల పరీక్షలను అత్యంత అసమర్ధంగా నిర్వహించడం
- ప్రజాకర్షక పధకాల పేరిట వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చెయ్యడం
- ఎన్నికల్లో లాభం పొందటం కోసం కొన్ని వర్గాలకు ప్రజా ధనాన్ని ధారపోయడం
- నియంతలా వ్యవహరించడం, వార్తా పత్రికల, విమర్శకుల నోళ్ళు నొక్కడం
- ప్రతిపక్షాలు లేకుండా చెయ్యాలని చూడడం
.
పై విషయాల్లో వ్యతిరేకత ఉన్నా, ప్రస్తుతానికి బీ.ఆర్.ఎస్ గెలవడమే తెలంగాణాకి మంచిదని నమ్మాను. కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ కుక్కలు చింపిన విస్తరి అయ్యే ప్రమాదం ఉంది. పదేళ్ళు వెనక్కి వెళ్ళే ప్రమాదమూ ఉంది. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భవిష్యత్తును నాశనం చేసే పాత పెన్షన్ విధానాన్ని తేవాలని కాంగ్రెస్ చూడడం అత్యంత దురదౄష్టకరం.

Sunday, November 19, 2023

Modi's Comforting Gestures

The disappointment in this Cricket World Cup Final brings to mind the letdown experienced by Indians due to the Chandrayaan-2 mission's failure. In both instances, there was an eagerness within Narendra Modi's public relations team to capitalize on potential positive sentiments that could have arisen in the event of success for Modi and the BJP.

It's understandable that the PR team sought to gain from the Chandrayaan-2 mission, considering the historical precedent of Indira Gandhi and Congress benefiting significantly from Rakesh Sharma's space mission. The iconic exchange between Indira Gandhi and Rakesh Sharma, immortalized in the hearts and minds of Indians, was likely a carefully orchestrated conversation. Sharma's response of "Saare Jahaan se Accha" was brilliantly apt.
Many decisions regarding the World Cup, from the schedule to the choice of venues, were influenced by Jay Shah-led BCCI with an eye on the elections. Notably, Punjab's Mohali did not host any matches this World Cup, and the final took place at Ahmedabad's Narendra Modi Stadium, potentially marking it as BJP's World Cup. Winning the final could have sparked widespread euphoria, benefiting the BJP in the upcoming elections.
While the success of these events could have been a public relations bonanza for Modi and the BJP, the PR team should have also taken into account the potential for a debacle.